బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి
నిజామాబాద్ సిటీ , బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ, సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసులు పార్టీ నాయకులను, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేసినప్పటికీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి జిల్లా కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్ కుమార్, పాలెపు రాజు, దాంపల్లి జ్యోతి, పోల్కం వేణు, సంఘం...