జాతీయ యువజన ఉత్సవాల్లో తెలుగు రాష్ట్రాల ప్రతినిధిగా శైలి బెల్లాల్
నిజామాబాద్, బతుకమ్మ: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ యువజన ఉత్సవాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశంలోని ఆయా రాష్ర్టాల నుంచి యువతీయువకులు పాల్గొంటుండగా, తెలుగు రాష్ర్టాల ప్రతినిధిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా యువజన అధికారిణి శైలిబెల్లాల్ హాజరయ్యారు. వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి ఎంపికైన యువతీయువకులకు ఇన్ చార్జీగా నిజామాబాద్ జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ నియమితులుకాగా, ఆమె ఆధ్వర్యంలో యువతీయువకుల బృందం కేంద్ర మంత్రులు జి...