Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 March 2026, 2:37 pm Posted by : ramakrishna

తెలంగాణ కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా

 

. .  .  దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్లను మారుస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు

 

నిజామాబాద్ డెస్క్, బతుకమ్మ : 

 

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లను బదిలీ చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 5న వెలువడిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ముఖ్యంగా తెలంగాణ గవర్నర్ పదవిలో మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న శివ ప్రతాప్ శుక్లాను తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమించారు. ఇప్పటివరకు తెలంగాణ గవర్నర్‌గా వ్యవహరించిన జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేశారు.

 

ఇతర రాష్ట్రాల గవర్నర్లు, ఎల్జీల బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి:

 

ఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న వినయ్ కుమార్ సక్సేనాను లడఖ్ ఎల్జీగా పంపగా, ఆయన స్థానంలో ఢిల్లీ కొత్త ఎల్జీగా తరంజిత్ సింగ్ సంధును నియమించారు.తమిళనాడు కేరళ గవర్నర్‌గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను తమిళనాడు గవర్నర్‌గా బదిలీ చేశారు. తమిళనాడు గవర్నర్‌గా ఉన్న ఆర్.ఎన్. రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమించారు.లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న కవిందర్ గుప్తాను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించారు. లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్‌ను బీహార్ గవర్నర్‌గా నియమించారు. నంద కిశోర్ యాదవ్‌ను నాగాలాండ్ గవర్నర్‌గా నియమించారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వచ్చాయి. పరిపాలనా సౌలభ్యం, వ్యూహాత్మక కారణాల దృష్ట్యా ఈ మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. కొత్తగా నియమితులైన గవర్నర్లు త్వరలోనే ఆయా రాష్ట్రాల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.