ఇంచార్జ్ తహాసీల్దార్ గా శాంత కుమారీ
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల తహాసీల్దార్ వెంకట్రావు శనివారం పదవి విరమణ చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు నూతన ఇంచార్జ్ తహాసీల్దార్ గా ధర్పల్లి మండలానికి చెందిన తహాసీల్దార్ శాంత కుమారీని ఇందల్వాయి మండల ఇన్చార్జి తహాసీల్దార్ గా నియమించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇందల్వాయి ఇంచార్జి తహాసీల్దార్ గా సోమవారం బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.