Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 November 2024, 7:16 pm Posted by : ramakrishna

టీఎన్జీఓ ఆధ్వర్యంలో షబ్బీర్ అలీకి సన్మానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీని టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా  సన్మానించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ టీఎన్జీవో నూతన జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన నాశెట్టి సుమన్ కుమార్ ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సుమన్ కుమార్ ఉద్యోగుల సమస్యలపై చర్చించగా షబ్బీర్ అలీ సానుకూలంగా స్పందించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, కేంద్రభాద్యులు పోల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గుడికందుల సంజీవయ్య, కోశాధికారి టి.దినేష్ బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్ హుస్సేన్ ,ఉమా కిరణ్, ప్రకాష్, జాన్ వెస్లీ, శశికాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.