Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 November 2024, 7:08 pm Posted by : ramakrishna

ఇస్తేమా కోసం స్థల పరిశీలన చేసిన షబ్బీర్ ఆలీ

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జనవరిలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే తబ్లిక్ జమాత్ ఇస్తేమా సభా స్థలాన్ని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ అధికారులతో కలిసి పరిశీలించారు. నగర శివారులోని సారంగాపూర్ తబ్లికే జమాతే ఇస్తేమా కోసం విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. తెలంగాణ, మహారాష్ట్ర నుండి 2 లక్షల మంది ముస్లీంలతో దాదాపు వంద ఎకరాల్లో సభకు హాజరవుతారని, ప్రభుత్వం నుండి అన్ని ఏర్పాట్లను చేయడానికి కసరత్తు మొదలుపెట్టారు. సభకు వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. షబ్బీర్ ఆలీ వెంట మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, విద్యుత్ శాఖ ఎస్ఈ రవీంధర్, ఇతర అధికారులు, నాయకులున్నారు.