బీబీపేట్, బతుకమ్మ : బీబీ పేటలో ఆదివారం శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప ఏడవ వార్షికోత్సవం అయ్యప్పసేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుండి గణపతి హోమం, కలిశాభిషేకం, అష్టాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్పసేవా సంఘం అధ్యక్షులు చందుపట్ల విట్టల్, ప్రధాన కార్యదర్శి భాశెట్టి నాగేశ్వర్, కోశాధికారి ఎం.పరశురాములు, గురు స్వామి చంద్రశేఖర్, ఎర్రం ప్రసాద్ ,ఆది రాజయ్య, భూమా గౌడ్, తేలు సత్యనారాయణ, నందకుమార్ పాల్గొన్నారు.
