ఒకేసారి కనిపించనున్న ఏడు గ్రహాలు
వెబ్ న్యూస్, బతుకమ్మ: ఈనెల 28వ తేదీన రాత్రి సమయంలో ఒకే వరుసలో ఏడు గ్రహాలు కనిపించి కనువిందు చేయనున్నాయి. ప్రపంచలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా గుర్తింపు పొందిన మహా కుంభ మేళ ముగియనున్న 26వ తేదీ తరువాత రెండు రోజులకు 28వ తేదీన ఇది చోటుచేసుకోనుంది. సూర్యుడి చుట్టూ పరిభ్రమించే బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బ్రుహస్పతి, శని, యురేనస్, నెఫ్ట్యూన్ ఇలా ఏడు గ్రహాలు ఒకే సరళ రేఖపైకి రానున్నాయి. ఖగోళ విశేషాలు, ఆధ్యాత్మిక శక్తికి మధ్య సంబంధం ఉందని, గ్రహాల కలయిక...