ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు
మహారాష్ట్రలోని మాలేగావ్ పేలుడు కేసులో.. వెబ్ న్యూస్, బతుకమ్మ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి మాలేగావ్ పేలుడు కేసులో ముంబయిలోని ఎన్ఐఏ కోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చింది. ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. మహారాష్ట్రలోని మాలేగావ్ లో 2008 సెప్టెంబర్ 29 జరిగిన పేలుడు తీవ్రతకు ఆరుగురు మృతి చెందగా, వందమందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో లోక్ సభ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నాల్ ప్రసాద్ పురోహిత్ తదితరులు నిందితులుగా ఉన్నారు.