బతుకమ్మ,ముప్కాల్ : ముప్కల్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఉషు అసోసియేషన్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో జడ్పీ యచ్ ముప్కల్ విద్యార్థులు వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. 56 కిలోల విభాగంలో రాఘవేంద్ర(బంగారు),35 కిలోల విభాగంలో రాజేష్ (బంగారు)లు రాష్ట్రస్థాయిలో గెలిచి పంజాబ్ లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అంతేగాక సాయి చరణ్ ( వెండి), సిద్ధార్థ (వెండి), వైష్ణవి (వెండి),
శ్రీవిద్య (కంచు) అభినయ్ (కంచు) లు విజేతగా నిలిచారు.బహుమతి ప్రధాన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గంగారం వ్యాయామ ఉపాధ్యాయులు కె.ప్రసాద్ రాష్ట్ర కబడ్డీ వైస్ ప్రెసిడెంట్ కె.గంగాధర్ రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.