ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
బతుకమ్మ, మాచారెడ్డి: ఉమ్మడి మాచారెడ్డి మండలంలోని ఆరేపల్లి, బండ రామేశ్వర్ పల్లి గ్రామాల పరిధిలోని వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న సమాచారాన్ని ఉమ్మడి మండల ప్రజలు 100కు డయల్ చేసి చెప్పాలని ఆయన కోరారు.