గణపతి ఉత్సవాల్లో పాల్గొనాలని సీఎంకు సికింద్రాబాద్ గణేష్ దేవాలయ కమిటీ ఆహ్వానం

  హైదరాబాద్, బతుకమ్మ :  గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా సికింద్రాబాద్ శ్రీ గణేష్ దేవాలయ కమిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించింది. గురువారం అసెంబ్లీలోని ఛాంబర్‌లో ముఖ్యమంత్రిని దేవాదాయ శాఖ కమిషనర్,   శ్రీ గణేష్ దేవాలయ కమిటీ అర్చకులు కలిసి ఆహ్వానాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు పలువురు శాసనసభ్యులు ఉన్నారు.