ధర్పల్లిలో కలకలం రేపిన కత్తెర పోట్లు
ధర్పల్లి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో కత్తెర పోట్లు కలకలం రేపాయి. మంగళవారం ఎన్టీఆర్ కాలనీకి చెందిన వడ్ల దాసు అనే వ్యక్తి నలుగురిని దర్జీ కత్తెరతో పొడిచాడు .దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. మొదట కాలనీలో గల మచ్చ లక్ష్మీ ని కత్తెరతో పొడవగా ఆమె కూతురు గౌతమి అడ్డుపడటంతో ఆమెను పొడిచాడు. గొడవ జరుగుతుందని గమనించి పక్కింటి వ్యక్తులు వెళ్లగా వారిలో శెట్పల్లి నాగరాజు, అతని భార్య శోభను కూడా కత్తెరతో పొడిచాడు. అక్కడి నుంచి కాలనీలో...