బతుకమ్మ,బాల్కొండ: బడిబాట కార్యక్రమంలో భాగంగా బుదవారం బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు బాల్కొండ లోని ఉపాధి హామీ కార్మికులు పనిచేసే చోట మండల విద్యాశాఖ అధికారి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని వసతులు ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్కు దీటుగా అన్నిరకాల వసతులు కల్పిస్తున్నదనీ, ప్రైవేట్ పాఠశాలలకు ఆకర్షితులు కావొద్దని, ప్రభుత్వం ప్రతి పేదింటి బిడ్డకూ కార్పొరేట్ విద్యను అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నదనీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి విద్యా మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవాలని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు. బుధవారం నుండి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో బడిబాటను విజయవంతం చేస్తామని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను, తల్లిదండ్రులకు వివరించి అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.