జలదిగ్బంధంలో పాఠశాల
నల్గొండ, బతుకమ్మ : ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మపల్లి గురుకుల పాఠశాల జలదిగ్బంధంలో చిక్కుకుంది. సమీపంలో వాగు ఉధ్రుతికి ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ పాఠశాలలో భారీగా వరద నీరు చేరడంతో విద్యార్థులు భయాందోళకు గురై కేకలు వేశారు. పాఠశాలలో 500 విద్యార్థులు ఉండగా, అధికారులు విద్యార్థులను తాడు సహాయంతో బయటకు తీసుకువచ్చారు.