స్కూల్ ఆటో బోల్తా

. పిల్లలను పరామర్శించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక ప్రతినిధి, బతుకమ్మ : దుబ్బాక మండలం కమ్మర్ పల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో మంగళవారం బోల్తాపడింది. గాయాలపాలై సిద్ధిపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ప్రమాద వివరాలను తెలుసుకుని విద్యార్థులను ఓదార్చారు.