. . . నేరుగా కాలేజీల్లో ప్రవేశాలకు అవకాశం
హైదరాబాద్, బతుకమ్మ :
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన విడుదల చేశారు. స్పాట్ అడ్మిషన్ల ద్వారా అర్హత కలిగిన విద్యార్థులు నేరుగా సంబంధిత పాలిటెక్నిక్ కళాశాలలకు వెళ్లి ప్రవేశాలు పొందవచ్చని అధికారులు తెలిపారు. ఖాళీగా ఉన్న సీట్లను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇదిలా ఉండగా, పాలిసెట్ ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తైంది. ఈ ప్రక్రియలో పాల్గొన్న 1,619 మంది విద్యార్థుల్లో 1,229 మందికి సీట్లు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. ఇంటర్నల్ స్లైడింగ్ ఫలితాలు tgpolycet.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు తమ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. అలాగే, స్పాట్ అడ్మిషన్లకు హాజరయ్యే విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలతో సంబంధిత కళాశాలకు వెళ్లాలని అధికారులు తెలిపారు.