తగ్గనున్న ఈఎంఐ
వెబ్ న్యూస్, బతుకమ్మ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ గృహరుణ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లెండింగ్ రేట్, రెపో లింక్డ్ లెండింగ్ రేట్లను తగ్గించింది. ఈసవరించిన రేట్లు ఫిబ్రవరి 15న అమల్లోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 6.50 శాతం నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతానికి తగ్గించిన సందర్భంగా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎంసీఎల్ ఆర్, బీపీఎల్ ఆర్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.