వీహెచ్ పి కార్యాలయంలో సత్యాపన బైఠక్ కార్యక్రమం
నిజామాబాద్ అర్బన్, బతకమ్మ : నగరంలోని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో గురువారం సత్యాపన బైఠక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర ఉపాధ్యక్షుడిగా బాసొల్లా నీకేష్, నగర గోరక్షక్గా రణదీప్ ను జిల్లా అధ్యక్షుడిగా దినేష్ ఠాకూర్ నియమించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రెబ్బ ఆనం, గాజుల దయానంద్, దాత్రిక రమేష్ తేలు శేఖర్, మహేష్, రామ్ చటర్జీ, అఖిల్, సురేష్, ఎండల సాయి పాల్గొన్నారు.