Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 10:01 pm Posted by : ramakrishna

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన సర్పంచ్

 

నాళేశ్వర్, బతుకమ్మ :

 

నాళేశ్వర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లను సోమవారం సర్పంచ్ ఆర్ముర్ లావణ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా నాళేశ్వర్ గ్రామానికి 48 మంది లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు కావడం జరిగిందన్నారు. అవన్ని చివరి దశలో పూర్తి కావడానికి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆర్ముర్ శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు, వార్డు సభ్యులు నవిన్, గణేష్,అనిల్, రాజు, కిషన్, కాంగ్రేస్ నాయకులు రాజన్న సంపత్, హన్మండ్లు, పోతన్న, నవిన్, సేక్రేటరి ఆఖీల్, కారోబార్ భుజంగ్ రావు ఉన్నారు.

 

Sarpanch who inaugurated Indiramma Houses