భిక్కనూరు, బతుకమ్మ :
భిక్కనూరు మండలంలోని సిద్ధ రామేశ్వరనగర్ గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు ల ను డ్వాక్రా సంఘం ఆధ్వర్యంలో శాలువా, జ్ఞాపికతో బుధవారం సన్మానించారు. సర్పంచ్ ప్రజాసేవకు అంకితం కావాలని డ్వాక్రా సంఘం అధ్యక్షురాలు వరలక్ష్మి అన్నారు. ప్రజలిచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలని సూచించారు. గ్రామాలలో మౌలిక వసతులు మురికి కాలువలు పై ప్రత్యేక దృష్టి సాదించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.