Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 March 2025, 1:05 pm Posted by : ramakrishna

సర్పంచ్ హత్య కేసు.. మంత్రి రాజీనామా

ముంబయి, బతుకమ్మ: సర్పంచ్ హత్య కేసు  ఆరోపణల నేపథ్యంలో మహారాష్ర్ట కేబినెట్ మంత్రి ధనుంజయ్ ముండే తన పదవికి రాజీనామా చేశారు. బీడ్ జిల్లా మసాజోగ్ గ్రామపంచాయతీ సర్పంచ్ సంతోష్ దేశ్ ముఖ్ ను దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేశారు.  ఈ ఘటన మహారాష్ర్టలో తీవ్రకలకలం రేపింది. ఈ కేసులో మంత్రి ముండే సన్నిహితుడైన వాల్మిక్ ను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రిపై సైతం ఆరోపణలు రావడం, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ వస్తుండడంతో ధనుంజయ్ రాజీనామా చేశారు. అజిత్ పవార్(ఎన్సీపీ) వర్గంలో ధనుంజయ్ కీలక నేతగా కొనసాగుతున్నారు.