కమ్మర్ పల్లి, బతుకమ్మ :
కమ్మర్ పల్లి మండలం అమీర్ నగర్ గ్రామ సర్పంచ్ వులే నీలవేణిదశరత్ గురువారం రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందనే నమ్మకంతో పార్టీలో చేరినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్,మాజీ అధ్యక్షులు సుంకేట రవి,డీసీసీ కార్యదర్శి పొడెండ్ల సంజీవ్,ఇనయత్ నగర్ సర్పంచ్ బానవత్ లలిత రాములు,ఉపసర్పంచ్ మకిలి అనిల్,గ్రామ శాఖ అధ్యక్షులు కందరి భూమరెడ్డి తదితరులు పాల్గొన్నారు.