Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 8:27 pm Posted by : ramakrishna

విద్యుత్ ఏబీ కేబుల్ పనులను పరిశీలిస్తున్న సర్పంచ్…

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో ముందు ముందు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఏబీ కేబుల్ పనులను చేపట్టారు. అందులో భాగంగా కొనసాగుతున్న పనులను శనివారం గ్రామ సర్పంచ్ మచ్కురి రమేష్ గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. గతంలో ఉన్న విద్యుత్ స్తంభాలకు ఉన్న పాత విద్యుత్ తీగలను తొలగించి నూతనంగా తీగలను ఏర్పాటు చేయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు హనుమంతు, అశోక్, రాము, శ్రీను, గంగాధర్, శంకర్, మక్కయ్య  తదితరులు ఉన్నారు.