బతుకమ్మ, భిక్కనూరు: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పిలుపుమేరకు భిక్కనూరు మండల కేంద్రంలో శుక్రవారం 2k రన్ నిర్వహించినట్లు భిక్కనూర్ ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ దేశ ప్రజలను ఐక్యత భావన వినిపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శనీయుడని స్వేచ్ఛ స్వాతంత్రం ఫలాలను మనమందరం పొందుతున్నట్లు తెలిపారు. దేశ ఐక్యతకు కృషిచేసిన దీశాలి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి “జాతీయ ఐక్యత దినంగా” జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది విద్యార్థులు ఉన్నారు.
