ఇసుక ట్రాక్టర్లు సీజ్
బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని మద్దెలచెరువు గ్రామ శివారులో ఆదివారం రాత్రి రెండు గంటలకు పుల్కల్ గ్రామం నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను మద్దెల చెరువు గ్రామంలో పట్టుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు పిట్లం ఎస్ఐ రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.