ఇసుక ట్రాక్టర్ పట్టివేత

కేసు నమోదు   బతుకమ్మ, మాచారెడ్డి: ఉమ్మడి మాచారెడ్డి మండలంలోని పాల్వంచ వాగు వద్ద ఏలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను  పోలీసులు పట్టుకున్నారు. పీఎస్ కు తీసుకువచ్చి కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ ఓనర్ అయిన మంథని దేవుని పల్లి గ్రామానికి చెందిన ఈదర్ ప్రశాంత్  పై కేసు నమోదు చేశారు. ఉమ్మడి మాచారెడ్డి మండలంలోని వాగు లో నుండి అక్రమంగా ఇసుక రవాణా చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు.