- ఆగిపోయిన మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లింపులు
- నిలిచిన బియ్యం సరఫరా
బతుకమ్మ భిక్కనూరు: సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నాటికి 14 రోజుకు చేరుకుంది. మండల విద్యా వనరుల కేంద్రంలో పనిచేసిన సిబ్బంది సమ్మె ప్రభావం వల్ల పీఎం పోషణ్ మరియు ట్రెజరీకి సంబంధించిన మధ్యాహ్న భోజన బిల్లులో అన్ని మండలాలలో నిలిచిపోయాయి. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే వంట కార్మికుల యొక్క బిల్లులను మండల విద్యాధికారి కార్యాలయంలో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్ చేసి ప్రజలకు పంపిస్తారు ప్రతి మండలాలలో దాదాపు 50 నుండి 150 వరకు వంట కార్మికులు ఉంటారు వీరి అకౌంట్లో బిల్లులు జమ చేయాలన్నా ఈ పనులు వలన మండల విద్యాధికారులు ఆయా మండలాల్లో పనులను నిలిచి సతమతమవుతున్నారు. అలాగే మధ్యాహ్న భోజన రైస్ ఇండెంట్ ఆన్లైన్ చేసేవారు లేక పాఠశాలలకు బియ్యం సరఫరా నిలిచిపోయాయి మరోవైపు కేజీవీబీలు భవిత సెంటర్లు పాఠశాలలో భోజనాలు లేక విద్యార్థులు సతమవుతున్నారు. త్వరలో ప్రభుత్వం స్పందించి వీరి సమస్యలను తీర్చి విద్యాశాఖలో స్తంభించిన పనులన్నీ పరిష్కరించాలని కోరుతున్నారు.
సమగ్ర శిక్ష ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి బీసీసీ హోదాలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం వస్తే 100 రోజుల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. సంవత్సర ఉద్యోగుల్ని విద్యాశాఖలో విల్లన్ చేసే వరకు సమ్మె కొనసాగిస్తాం. వైద్య సంపత్, డేటా ఎంట్రీ ఆపరేటర్ల, జిల్లాఅధ్యక్షులు కామారెడ్డి.

సమగ్ర శిక్ష ఉద్యోగుల ఏమైనా డిమాండ్ పరిష్కారం అయ్యేవరకు సమ్మెలో ఉంటాం గత 18 సంవత్సరాలుగా విద్యాశాఖలో కీలకంగా పని చేసే మమ్మల్ని ప్రభుత్వం విస్మరించడం తగదు మాకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలి. గంగ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి, కామారెడ్డి.
