Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 April 2025, 2:18 pm Posted by : ramakrishna

మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్

విజయవాడ, బతుకమ్మ : ఏపీలో మద్యం కుంభకోణం కేసు పలు కీలక మలుపులు తిరుగుతోంది.  మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డికి మే 6 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. సిట్ అధికారులు అతడిన్ని విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. ఎస్ పీవై అగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి మద్యం కుంభకోణం ప్రధాన కుట్ర దారుల్లో కీలక నిందితుడుగా ఉన్నాడు. ఈకేసులో ఏ6గా ఉన్న అతడిని సిట్ అధికారులు శుక్రవారం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో అరెస్టు చేశారు. శనివారం విజయవాడకు తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో హాజరు పర్చారు.