ఒక్క ఓటుతో కంఠం సర్పంచ్ గా గెలుపొందిన సాయినాథ్

నందిపేట్, బతుకమ్మ :    నందిపేట్ మండలం కంఠం గ్రామంలో సర్పంచ్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ ఓట్ల లెక్కింపులో అజిగిరి సాయినాథ్ 712 ఓట్లు సాధించగా ప్రత్యర్థి అభ్యర్థికి 711 ఓట్లు రావడంతో కేవలం ఒక ఓటు మెజార్టీతో అజిగిరి సాయి నాథ్ గెలుపొందారు. ఓడిన అభ్యర్థి అధికార పార్టీ అండతో పోలీసులు బలగాలను దింపి జయించాలని కుట్రలు చేశారు.అయినప్పటికీ అజిగిరి సాయినాథ్ కేవలం ఒక్క ఓటుతో గెలుపొందారు.