Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 February 2026, 8:34 pm Posted by : ramakrishna

గాడి మాకుల రాజరాజేశ్వర స్వామి రథోత్సవంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

 

. . . శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

 

సిరికొండ, బతుకమ్మ :

 

సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో గాడి మాకుల రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రథోత్సవం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ, రావుట్ల గ్రామంలో ఇంత ఘనంగా రాజరాజేశ్వర స్వామి జాతర, రథోత్సవం జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. స్వామివారి ఆశీస్సులతో రావుట్ల గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, పీసీసీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎర్రన్న, నిజామాబాద్ రూరల్ యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

Rural MLA Bhupathi Reddy participated in the chariot festival of Gadi Makula Rajarajeshwara Swamy