Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 July 2025, 1:45 pm Posted by : ramakrishna

కుట్టుమిషన్లను పంపిణీ చేసిన  రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం  క్రిస్టియన్ మైనార్టీ శాఖ ద్వారా మంజూరైన ఏడు కుట్టు మిషన్లను లబ్ధిదారులకు  రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వం కోటిమంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే  లక్ష్యంగా పెట్టుకుందన్నారు.  మహిళ సహాయక సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించి, సోలార్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తే,    ప్రభుత్వం మహిళలకు అద్దె చెల్లిస్తుందన్నారు.  కార్యక్రమంలో జక్రాన్ పల్లి తహసీల్దార్, పీసీసీ డెలికేట్ శేఖర్ గౌడ్, జక్రాన్ పల్లి మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, నిజామాబాద్ రూరల్ యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్, క్రిస్టియన్ మైనార్టీ శాఖ అధికారులు, లబ్ధిదారులు  పాల్గొన్నారు.

Rural MLA Bhupathi Reddy distributed sewing kits