రుద్రూర్, బతుకమ్మ : కామారెడ్డి పట్టణంలో నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి శుక్రవారం రుద్రూర్ మండల బీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రానికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు జై తెలంగాణ.. జై కెసిఆర్..జై కేటీఆర్.. అంటూ నినాదాలు చేశారు. దీక్షా దివాస్ కు వెళ్లిన వారిలో వెళ్లిన వారిలో బీఆర్ ఎస్ మండల ఇంచార్జ్ గాండ్ల మధు, తదితరులు ఉన్నారు.