Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 September 2025, 3:30 pm Posted by : ramakrishna

దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు : డీఎం సరిత దేవి

బాన్సువాడ, బతుకమ్మ : దసరా పండుగను సందర్భంగా హైదరాబాద్ నుంచి బాన్సువాడ వరకు పండుగలకు సొంత ఊర్లకు వచ్చే ప్రయాణికుల కోసం స్పెషల్ బస్సులు డీలక్స్, లగ్జరీ బస్సులు ఏర్పాట్లు చేసినట్లు బాన్సువాడ ఆర్టీసీ డీఎం సరిత దేవి ప్రకటన విడుదల చేసారు. హైదరాబాద్ జేబీఎస్ బస్టాండ్ నుంచి ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. పండుగకు వచ్చే ప్రయాణికులు తిరుగు ప్రయాణం. అయ్యేవరకు ఈనెల 27 నుంచి వచ్చేనెల 6 వరకు సేవలు అందిస్తాయని తెలిపారు. ప్రయాణం చేసిన ప్రయాణికు లు వారు తీసుకున్న టికెట్ పై ఫోన్నెనెంబర్ రాసి బాన్సువాడ బస్టాండ్లో లక్కీడ్రా బాక్స్లో టికెట్ వేయా లని ఆమె కోరారు. దివ్యాంగులు, వృద్ధులకు యాత్ర దానం నిర్వహించుటకు ఎన్ఆర్వ లు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చాలా సురక్షితమని ప్రయాణి కులకు వారి గమ్యస్థానాలకు చేరుస్తామని ఆమె దీమా వ్యక్తం చేశారు. లక్కీ డ్రాలో గెలు పొందిన వారికి మొదటి బహుమతి రూ.25వేలు, రెండో బహుము రూ.15వేలు, మూడో బహుమతి రూ.10 వేల నగదు ఇస్తామని తెలిపారు. ప్రయాణికులు దసరా బస్సులను సద్వినియోగం చేసుకొని పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలని ఆమె కోరారు.