మున్సిపాలిటీ కార్మికులిని ఢీకొట్టిన ఆర్టీసీ బస్
. . . తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు బోధన్ ,బతుకమ్మ: బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక మున్సిపాలిటీలో స్వీపర్గా విధులు నిర్వహిస్తున్న భాగ్యం నాగమణిను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు స్థానికులు వెంటనే స్పందించి, నాగమణిని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.