బతుకమ్మ, భిక్కనూరు: కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళుతున్న నాన్ స్టాప్ బస్సు భిక్కనూరు టోల్ ప్లాజాలో జాతీయ రహదారిపై సోమవారం నిలిచిపోయింది. క్లచ్ లో సాంకేతిక సమస్య కారణంగానే ఈ బస్సు నిలిచినట్టు సిబ్బంది తెలిపారు. ఈ సమయంలో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు మాట్లాడుతూ కాలం చెల్లిన బస్సులను తిప్పుతూ మరింత ప్రయాణికులకు ఇబ్బంది పెడుతున్నారన్నారు. కామారెడ్డి డిపో లోకల్ బస్సులు స్టేజీల దగ్గరనే ఆపుతామని కాలేజీల దగ్గర స్కూల్ దగ్గర ఆపమని డ్రైవర్లు ,కండక్టర్లు ఇష్టం వచ్చిన రీతిలో తిడుతున్నారని విద్యార్థులు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీకి సంబంధించిన అధికారులు జోక్యం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
