తె. యూ.కు రూ. 500 కోట్లు కేటాయించాలి
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించాలని పీడీఎస్ యూ తెలంగాణ యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి కే.గౌతం రాజ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో సెంట్రల్ లైబ్రరీ ఎదుట గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ యూనివర్సిటీని సీఎం సందర్శించాలని కోరారు, ఇంటిగ్రేటెడ్, పీజీ విద్యార్థులకు నెలకు రూ. 2000 ఫెలొషిఫ్స్ ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి అమలు చేయాలని,యూనివర్సిటీ లో నూతన వృత్తి విద్య కోర్సులను తీసుకురావాలనీ...