- మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని తాడ్కోల్ బీడీ వర్కర్స్ కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్ పరిశీలించారు. వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు ప్రతి వార్డులో డ్రైనేజీ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. నాణ్యతతో పనులు చేపట్టాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఆయన వెంట భగవాన్ రెడ్డి, నార్ల ఉదయ్ ఉన్నారు.