కుంభమేళా కు వెళ్లి.. వస్తుండగా రోడ్డు ప్రమాదం
44వ జాతీయ రహదారిపై బోల్తా పడిన బొలెరో 11 మందికి గాయాలు నిజామాబాద్, బతుకమ్మ : కుంభమేళాకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బుస్సాపూర్ వద్ద 44వ జాతీయ రహదారిపై బొలెరో అదుపు తప్పి బోల్తా పడింది. ఈఘటనలో 11 మంది తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రికి తరలించారు. బాధితులను నల్గొండ వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.