44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో 44వ జాతీయ రహదారిపై  బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద 44 వ జాతీయ రహదారిపై కామారెడ్డి నుంచి రామాయంపేట వైపు బైక్ పై వెళ్తున్న వారిని రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ ఢీకొంది. ఈప్రమాదంలో బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయలయ్యాయి. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.