అబుదాబిలో రోడ్డు ప్రమాదం.. తొర్తి గ్రామ వాసి మృతి
ఏర్గట్ల, బతుకమ్మ: అబుదాబిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని తొర్తి గ్రామానికి చెందిన ఈర్గాల గంగాధర్ మృతి చెందాడు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో బతుకుదెరువు కోసం అబుదాబి వెళ్లిన గంగాధర్ అక్కడ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. శనివారం డ్యూటీకి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. తొర్తి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.