Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2025, 4:13 pm Posted by : ramakrishna

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

బోధన్, బతుకమ్మ : బోధన్ మండలం పెంటకాలన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని అధ్యక్షులు రాజారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెగడపల్లి,భులక్ష్మి క్యాంప్, బార్డిపూర్, అంబామ్, లాంగడపూర్ ,పెంటకాలన్ ప్రాంత రైతులు ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకె ధాన్యం అమ్ముకోవాలన్నారు, ప్రైవేట్ వ్యాపారులకు దళారులను నమ్మి అమ్ముకోవద్దని సూచిస్తుంది..ఈ కార్యక్రమంలో సొసైటీ సెక్రటరీ బాబా,ఏఈవో సరోజా, వైస్ చైర్మన్ శివకుమార్, డైరెక్టర్లు లక్ష్మయ్య,ఆవుల సుబ్బారెడ్డి, దామ్మయ్య, రైతులు  పాల్గొన్నారు.