పరిశోధనలతోనే సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు

వైస్ ఛాన్స్లర్  ఆచార్య టి.యాదగిరిరావు   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : పరిశోధనలతోనే సమాజంలో విప్లవాత్మకమైన మార్పుల వస్తాయని వైస్ ఛాన్స్లర్  ఆచార్య టి.యాదగిరిరావు అన్నారు.  తెలంగాణ  విశ్వవిద్యాలయం బిజినెస్ మేనేజ్మెంట్  విభాగం ఆధ్వర్యంలో పరిశోధన పత్రాల తయారీ  అనే అంశంపై  విభాగాధిపతి,కార్యాశాల కన్వీనర్  ఆచార్య సిహెచ్ ఆంజనేయులు అధ్యక్షతన మంగళవారం  కార్యశాలను నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న   వైస్ ఛాన్స్లర్  ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో క్షేత్రస్థాయి పరిశోధనలే సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తాయన్నారు. యువత నూతన వినూతన మార్పుల...