ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్ స్పెక్టర్ 

నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ :  నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్  ఏసీబీకి చిక్కారు. బుధవారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.  రెవెన్యూ ఇన్ స్పెక్టర్  శ్రీనివాసచారి రూ. 7000 లంచం తీసుకుంటుండగా  అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.