రెవెన్యూ ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

బాన్సువాడ, బతుకమ్మ  : రెవెన్యూ ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. వీఆర్ఏల నుంచి జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన ఉద్యోగులు ఇంక్రిమెంట్ సర్క్యులర్ సాధించిన సందర్భంగా మంగళవారం సబ్ కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి, టీజీఆర్ఎస్ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, నాయబ్ తహశీల్దార్ గంగప్రసాద్, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు...