హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అంతకు ముందు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లో ఆమె విగ్రహానికి నివాళులు అర్పించారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. మహిళ ప్రజాప్రతినిధులు, అధికారులు ఇందిరమ్మ చీరలు ధరించాలని రేవంత్ కోరారు. నేటి నుంచి డిసెంబర్ 9 వరకు గ్రామాల్లో 65 లక్షల చీరలు పంపిణీ చేయనున్నారు.