పాశమైలారం ఘటన స్థలాన్ని పరిశీలించిన రేవంత్ రెడ్డి

సంగారెడ్డి, బతుకమ్మ : సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటన స్థలాన్ని మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలు పర్యవేక్షించారు.అనంతరం క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ఈరోజు ఉదయం జిల్లా ఇన్ చార్జి మంత్రి వివేక్, మంత్రి దామోదర్ రాజనర్సింహ స్థలాన్ని పరిశీలించారు. కాగా, పాశమైలారం పేలుడు ఘటనలో ఇప్పటివరకు 36 మంది మృతి చెందారు.