ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు బ్లడ్ గ్రూప్ పరీక్షలు నిర్వహించాలనే కథనానికి హెడ్మాస్టర్ లక్ష్మీనాథం, వైద్య ఆరోగ్య బృందం స్పందించి విద్యార్థులకు శనివారం రక్త పరీక్షలు నిర్వహించారు.విద్యార్థులందరూ స్వచ్ఛందంగా రక్త పరీక్షలు చేయించుకున్నారు. సుమారుగా 200 మంది విద్యార్థులకు పరీక్షలు చేశారు.దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు..
ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రాధిక, అంగన్వాడి టీచర్లు, వైద్య బృందం ఉన్నారు.
