నిజామాబాద్, బతుకమ్మ: నగరంలోని మాధవనగర్ నర్సన్న కాలనీలో గుడెసెలు వేసుకుని ఉంటున్న తమకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ స్థానికులు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెండు నెలల్లో గుడిసెలకు పట్టాలిస్తానని, రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందజేసిన వారిలో గుడిసె వాసులతోపాటు తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు కత్తుల మారుతి, పల్ల మల్లేశ్, నర్సింలు, సత్యనారాయణ, శంకర్, రాజు, కొండ అనూషవ్వ, షేక్ రజియా, అనిత, అలుగు శోభ తదితరులున్నారు.
