Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 April 2025, 7:31 pm Posted by : ramakrishna

పేదలకు డబుల్​ బెడ్​రూం ఇళ్లు కేటాయించాలని వినతి

నిజామాబాద్​ సిటీ, బతుకమ్మ:  నగరంలోని పేదప్రజలకు డబుల్​ బెడ్​రూం ఇళ్లను కేటాయించాలని ఎంఐఎం నాయకులు జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లిని కోరారు. బుధవారం జిల్లాకు వచ్చిన ఇన్​ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు.  ఈసందర్భంగా ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్​ మాట్లాడుతూ.. నగర శివారులోని 10వ డివిజన్​ పరిధిలో నాగారం బొడ్డెమ్మ చెరువు, భారతి రాణి కాలనీల్లో అధికారులు పేదల ఇళ్లను కూల్చేశారన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇళ్లను కూల్చడంతో పేదలు ఇప్పటికీ.. దుర్భర జీవితాలు గడుపుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారికి డబుల్​ బెడ్​రూం ఇళ్లను కేటాయించాలని విన్నవించారు. ఇళ్ల కూల్చివేతల్లో నష్టపోయిన వారి పేర్లను డబుల్​ బెడ్​రూం ఎంపిక కమిటీ సభ్యులు పరిశీలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు పాల్గొన్నారు.